హైదరాబాద్: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్, ఆయన సతీమణి కూడా ఇవాళ ఢిల్లీలోని హార్ట్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్లో తొలి డోసు కోవిడ్ టీకా తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ కే కేశవ రావు ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో ఆయన తొలి డోసు టీకా వేయించుకున్నారు. ఇక శ్రీనగర్లో జమ్మూకశ్మీర్ నేత, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫారూక్ అబ్దుల్లా టీకా తీసుకున్నారు. షేర్ ఏ కశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీలో ఆయన తొలి డోసు టీకా వేయించుకున్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి దేశవ్యాప్తంగా ఉచిత టీకాలు నిన్నటి నుంచి ఇస్తున్న విషయం తెలిసిందే. 45 ఏళ్లు దాటి, వ్యాధులు ఉన్నవారు కూడా కోవిడ్ టీకాలను వేసుకోవచ్చు.