లింగ సమానత్వం మన దేశంలో చాలా అధ్వానంగా ఉన్నది. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్ ఎక్కడో అట్టడుగున ఉండటం కలవరపరిచే అంశం. గ్లోబర్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసింది. ఈ నివేదికలో 156 దేశాలకు చెందిన సమాచారాన్ని పొందుపరిచారు.
లింగసమానత్వంలో భారత్ 28 స్థానాలు పడిపోయి 140 వ స్థానానికి చేరుకున్నది. కరోనా మహమ్మారి కారణంగా అసమానత పెరిగినట్లు నివేదిక పేర్కొన్నది. పురుషులు-మహిళల మధ్య సమానత్వం చేరుకోవడానికి గత ఏడాది వరకు 99.5 సంవత్సరాల సమయం అవసరం అవగా.. ఇప్పుడు 135.6 సంవత్సరాలు పడుతుందని నివేదికలో తెలిపారు. అంటే అంతరం ఏడాది పొడవునా సుమారు 36 సంవత్సరాలు పెరిగింది.
నాలుగు ప్రధాన ప్రమాణాల ఆధారంగా లింగ అంతరాన్ని కొలుస్తారు. ఆర్థిక భాగస్వామ్యం-అవకాశం, విద్యా స్థితి, ఆరోగ్యం-మనుగడ స్థితి, రాజకీయ సాధికారత వీటిలో ఉన్నాయి.
అత్యధిక అసమానత రాజకీయాల్లో ఉన్నది. రాజకీయాల్లో మహిళల సంఖ్య 22 శాతం మాత్రమే ఉండగా.. ఆరోగ్య రంగంలో సమానత్వం అత్యధికంగా ఉన్నది. అక్కడ మహిళలు 96 శాతంగా ఉన్నారు. ఆర్థిక సమానత్వంలో మహిళల సంఖ్య 58 శాతంగా ఉన్నప్పటికీ, వారు పురుషులతో సమానంగా మారడానికి 267.6 సంవత్సరాలు పడుతుందని నివేదికలో తెలిపారు.
37 దేశాలు విద్యారంగంలో స్త్రీ-పురుష సమానత్వ స్థాయిని సాధించాయి.
156 దేశాల పార్లమెంటు సభ్యులలో 35,500 మందిలో 26.1 శాతం మంది మహిళా ఎంపీలు ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,400 మంది మంత్రులలో 22.6 శాతం మంది మహిళా మంత్రులు ఉన్నారు.
ఐస్లాండ్లో అతి తక్కువ వివక్ష ఉన్నట్లు నివేదిక తెలిపింది.
మన దేశం రాజనీతిలో మహిళలు 22 శాతంతో 51 వ ర్యాంకు, ఆర్థిక సమానత్వంలో 58 శాతంతో 151 వ ర్యాంకు, విద్య రంగంలో 95 శాతంతో 114 వ ర్యాంకు, ఆరోగ్య రంగంలో 96 శాతంతో 155 వ ర్యాంకు సాధించింది.
స్త్రీ-పురుష సమానత్వం పరంగా ఐస్లాండ్ వరుసగా 12 వ సంవత్సరం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నది. ఇక్కడ సమానత్వం స్థాయి 90 శాతంగా ఉన్నది. అంటే అతి తక్కువ వివక్ష ఉన్నదన్న మాట. సాధారణంగా వెనుకబడినవారిగా పరిగణించబడే నమీబియా, రువాండా, లిథువేనియా వంటి దేశాలు కూడా టాప్ -10 దేశాలలో ఉండటం విశేషం.
లింగసమానత్వంలో ఐస్లాండ్ 89.2 శాతంతో తొలిస్థానంలో ఉండగా.. 86.1 శాతంతో రెండో స్థానంలో ఫిన్లాండ్, 84.9 శాతంతో మూడో స్థానంలో నార్వే, 84 శాతంతో నాలుగో స్థానంలో న్యూజిలాండ్, 82.3 శాతంతో ఐదో స్థానంలో స్వీడన్ ఉన్నాయి.
హిమాలయాల్లో 2 టన్నుల చెత్త.. సేకరించిన నేపాల్ పర్వతారోహకులు
కొవిడ్ థర్డ్ వేవ్ కారణంగా ఫ్రాన్స్లో లాక్డౌన్
ప్రజాప్రతినిధుల పని తీరే ఓటేసేందుకు కొలమానం కావాలి: వెంకయ్యనాయుడు
మిలటరీ డెయిరీ ఫాంల మూసివేత.. 132 ఏండ్లు కొనసాగిన ఆర్మీ పాడి
ఆల్ ఫూల్స్ డే.. ఎందుకు..? ఎప్పుడు..? ఎలా..? చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..