విద్యాబాలన్ నటించిన ‘శకుంతలాదేవి’ చిత్రం ఓటీటీలో విడుదలై అందరిని ఆకట్టుకుంది. ఆమె తాజా హిందీ చిత్రం ‘షేర్నీ’ కూడా ఓటీటీ ద్వారా జూన్లో ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమాను విడుదలచేయబోతున్నట్లు చిత్రబృందం సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా విద్యాబాలన్ కొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో అడవి ప్రాంతంలో వాకీటాకీ చేతిలో ధరించి విద్యాబాలన్ కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ధైర్యవంతురాలైన ఫారెస్ట్ ఆఫీసర్గా విద్యాబాలన్ కనిపించబోతున్నది. మధ్యప్రదేశ్లోని అడవుల్లో ఈ సినిమా చిత్రీకరణను జరిపారు. మనుషులు, జంతువుల మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో వినూత్నమైన పాయింట్తో దర్శకుడు అమిత్ మసుర్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.