కరోనా భయాలు తొలగిపోతున్న నేపథ్యంలో ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లకు అనుమతులిచ్చాయి. అయినా ప్రేక్షకులు సినిమాలకు వస్తారో?లేదో? అనే సంశయంతో యాజమాన్యాలు మాత్రం ఇప్పటివరకు థియేటర్లను పునఃప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో వివిధ భాషలకు చెందిన పలువురు అగ్రకథానాయకులు ఓటీటీల బాటపడుతున్నారు. తాజాగా ఆ జాబితాలో వెంకటేష్ చేరారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘నారప్ప’ చిత్రం ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలకానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం సోమవారం కొత్త పోస్టర్ను విడుదలచేసింది. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సురేష్బాబు, కలైపులి ఎస్ థాను నిర్మించారు. గ్రామీణ నేపథ్యానికి కుటుంబ బంధాలను జోడిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రియమణి, కార్తిక్త్న్రం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.