రంగులు చల్లుకుంటూ హోరెత్తించిన యువత
కేరింతలతో చిన్నారుల తుళ్లింత
ఆంక్షల నేపథ్యంలో పరిమితంగా వేడుకలు
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రంగుల కేళీ.. హోలీ పం డుగను ఆదివారం ప్రజలు నిర్వహించుకున్నారు. చి న్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగులను పూసుకొని హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పిల్లలు, యువత, మహిళలు కేరింతలతో నృత్యాలు చే శారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా వే డుకల్లో పాల్గొన్నారు. ఆదివాసీ గ్రామాల్లో కామద హనం చేసి, వేడుకలు నిర్వహించారు. గ్రామపటేళ్లకు కు డుకలు, చక్కెర బిళ్లల హారాలను సమర్పించారు. గిరి జన సంప్రదాయ నృత్యాలు చేశారు. కరోనా తీవ్రత నే పథ్యంలో ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఈ ఏడాది అంతంతమాత్రంగానే వేడుకలు నిర్వహించారు.
మెల్లగా ఆహారం తినండి.. శరీరం బరువు తగ్గించుకోండి..!
నిమ్మరసం, పసుపు కలుపుకొని తాగితే కలిగే లాభాలివే..!