‘డ్యాన్స్ బ్యాక్డ్రాప్లో తెలుగులో సినిమా వచ్చి చాలా కాలమైంది. పాటలు, ప్రచార చిత్రం చూస్తుంటే నేను నటించిన ‘స్వర్ణకమలం’ చిత్రం గుర్తొచ్చింది’ అని అన్నారు అగ్ర హీరో వెంకటేష్. కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకుడు. ఈ చిత్రంలోని ‘పోనీ పోనీ ఈ ప్రాణమే’ అనే పాటను హీరో వెంకటేష్ విడుదలచేశారు. కరుణాకర్ సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని లలిత కావ్య ఆలపించారు. శ్రవణ్ భరద్వాజ్ స్వరకర్త. ఈ సందర్భంగా సంధ్యారాజు మాట్లాడుతూ “స్వర్ణకమలం’ నాకు ఇష్టమైన చిత్రం. ఆ సినిమాతో వెంకటేష్గారు మా చిత్రాన్ని పోల్చడం గర్వంగా అనిపిస్తున్నది. నాట్యం గొప్పతనాన్ని చాటిచెప్పే చిత్రమిది’ అని చెప్పింది. నాట్య గురువుకు, అతడి శిష్యురాలికి మధ్య జరిగే కథ ఇదని దర్శకుడు పేర్కొన్నారు. కమల్ కామరాజు, రోహిత్, ఆదిత్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కథ, ఛాయాగ్రహణం, ఎడిటింగ్, దర్శకత్వం: రేవంత్ కోరుకొండ.