టాలీవుడ్లో వరుస విషాదాలు అభిమానులని శోకసంద్రంలో ముంచెత్తుతున్నాయి. కరోనా వలన కొందరు, అనారోగ్యం వలన ఇంకొందరు కన్నుమూసారు. తాజాగా ప్రముఖ నిర్మాత ఆర్ ఆర్ వెంకట్ ఈరోజు ఉదయం అనారోగ్య కారణాలతో కన్నుమూశారు.కిడ్నీ ఫెయిల్ అయిన కారణంగా కన్నుమూసినట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని గచ్చిబౌలి ఏ ఐ జి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసినట్లు చెబుతున్నారు.
ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద అనేక సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన ఆర్ఆర్ఆర్ వెంకట్.. సామాన్యుడు సినిమాతో నిర్మాతగా మారాడు.ఆంధ్రావాలా, కిక్, ప్రేమ కావాలి, డాన్ శీను, మిరపకాయ్, బిజినెస్ మాన్, డమరుకం, పైసా వంటి సినిమాలను నిర్మించారు. అలాగే ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో డైవర్స్ ఇన్విటేషన్ అనే ఒక హాలీవుడ్ సినిమాని కూడా నిర్మించారు వెంకట్.వెంకట్ హఠాన్మరణంపై సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.