శ్రీవిష్ణు, మేఘా ఆకాష్, సునయన నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘రాజరాజచోర’. హసిత్ గోలి దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.ఈ నెల 18న ఈ చిత్ర టీజర్ను విడుదలచేయబోతున్నట్లు చిత్రబృందం ప్రత్యేక వీడియో ద్వారా ప్రకటించింది. ‘బిగ్బాస్’ ఫేమ్ గంగవ్వ వాయిస్ ఓవర్తో రూపొందించిన ఈ యానిమేషన్ వీడియో ఆకట్టుకుంటుంది. ఇందులో ‘అనగనగా భూమి నుంచి కోతి వచ్చింది.బంగారం వచ్చింది.కోతి మనిషి అయ్యింది. బంగారం కిరీటం అయ్యింది. మనిషి దొంగ అయ్యాడు. కిరీటం రాజు అయ్యింది..’ అంటూ గంగవ్వ చెప్పిన రాజు, దొంగ కథ ఆసక్తిని పంచుతోంది. ఈ కథ ద్వారా సినిమాలో శ్రీవిష్ణు దొంగ పాత్రలో నటించబోతున్నట్లు చూపించారు. అతడి ఏం దొంగతనం చేశాడన్నది ఉత్కంఠభరితంగా ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు. తనికెళ్లభరణి, రవిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్సాగర్.