ఆక్లాండ్ : న్యూజిలాండ్ వెటరన్ ఆల్ రౌండర్ రిచర్డ్ హాడ్లీ విరాట్ సేన ఆటతీరుపై ప్రశంసలు కురిపించారు. క్రికెట్కు భారత్ ఎంతో అవసరమన్నారు. టెస్ట్ క్రికెట్లో పురోగతి కనిపిస్తున్నదని చెప్పారు. భారతదేశం లేకపోతే ప్రపంచ క్రికెట్ చాలా భిన్నంగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.రిచర్డ్ హాడ్లీ 1970 -1980 లలో గొప్ప ఆల్ రౌండర్గా కొనసాగారు. ఇమ్రాన్ ఖాన్, కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్లతో సమానంగా క్రికెట్ రారాజుగా వెలుగొందారు.
ఇతర ఫార్మాట్ల మాదిరిగానే టెస్ట్ క్రికెట్లో భారత్ అద్భుతమైన కృషి చేస్తున్నదని రిచర్డ్ హాడ్లీ చెప్పారు. భారత జట్టులో చాలా మంది యువకులు ఉండి సమతూకంతో ఉన్నారని, వీరంతా అద్భుత ఆటతీరును ప్రదర్శిస్తున్నారని కితాబునిచ్చారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తటస్థ వేదికపై జరిగే మ్యాచ్ వల్ల ఎవరూ దేశీయ ప్రయోజన పొందలేరన్నారు. అయితే, ఈ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని మాత్రం చెప్పగలనన్నారు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్పై వాతావరణం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందని, వాతావరణం చల్లగా ఉంటే న్యూజిలాండ్కు మేలు చేస్తుందని హాడ్లీ తెలిపారు. డ్యూక్ బాల్ రెండు జట్ల ఫాస్ట్ బౌలర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. బంతి స్వింగ్ చేస్తే రెండు జట్ల బ్యాట్స్మెన్లకు సవాలుగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే దానిని అంచనా వేయడానికి హాడ్లీ నిరాకరించారు.
ఒలింపియన్ సుశీల్ కుమార్ను సస్పెండ్ చేసిన రైల్వే
సీబీఐ డైరెక్టర్ ఎంపిక : జస్టిస్ రమణ అభ్యంతరంతో ఇద్దరి పేర్లు ఔట్..?!
అమరీందర్కు పక్కలో బళ్లెంలా సిద్దూ
నక్సల్స్ దాడిలో కాంగ్రెస్ నేతల మృతి.. చరిత్రలో ఈరోజు
‘హవానా సిండ్రోమ్’ : అమెరికాను కలవరపెడుతున్న మైక్రోవేవ్ దాడులు
కరోనా నియంత్రణకు కాక్టైల్ ఔషధాన్ని తీసుకొచ్చిన రోచె-సిప్లా
సహజంగా బరువు తగ్గేందుకు ఈ పండ్లు తినండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..