‘గర్వం ఎక్కువగా ఉండే అందమైన అమ్మాయి ఆమె. సౌమ్యుడు, శాంతస్వభావుడైన అబ్బాయి అతడు. వారిద్దరి మధ్య మొదలైన ప్రేమాయణం పెళ్లిపీటల వరకు చేరుకుందా? లేదా తెలియాలంటే విజయదశమి వరకు ఆగాల్సిందే’ అంటున్నారు నాగశౌర్య. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావాలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకురాలు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రీతూవర్మ కథానాయిక. దసరా సందర్భంగా అక్టోబర్ 15న ఈ సినిమాను విడుదలచేయబోతున్నట్లు శనివారం చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రచార చిత్రాన్ని విడుదలచేసింది. నిర్మాత మాట్లాడుతూ ‘భిన్న మనస్తత్వాలు కలిగిన ఓ జంట కథ ఇది. గొడవలతో మొదలైన వారి పరిచయం ఎలా ప్రేమగా మారిందన్నది ఆకట్టుకుంటుంది. వినోదం, రొమాన్స్, కుటుంబవిలువల ప్రధానంగా సినిమాను తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’ అని తెలిపారు. నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, మాటలు: గణేష్ కుమార్ రావూరి.