కరోనాను లెక్క చేయకుండా సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో పలువురు కరోనా బారిన పడతున్నారు. తాజాగా జబర్ధస్త్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న వర్ష కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని లైవ్లోకి వచ్చి ప్రకటించింది. రెండు రోజులుగా నా ఆరోగ్యం బాగోలేదు. దీంతో కరోనా పరీక్ష చేయించుకున్నాను. అందులో పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని లైవ్లోకి వచ్చి ఎందుకు చెప్పాలని అనుకున్నానంటే బయట పరిస్థితి మరింత దారుణం ఉంది. చనిపోయిన వారిని ప్యాక్ చేసి పడేస్తున్నారు.
ఈ సంఘటనలను చూస్తుంటే గుండె తరుక్కుపోయి విషయాన్ని లైవ్లోకి వచ్చి చెప్పాలని అనుకున్నాను. అందరు జాగ్రత్తగా ఉండండి. రోజు వేడి నీళ్లు తాగండి. ఎన్ని జాగ్రత్తలు ఉంటే అన్నీ తీసుకోండని సూచించింది వర్ష. జబర్థస్త్ కార్యక్రమం ద్వారా బాగా పాపులారిటీ దక్కించుకున్న ఈ అమ్మడు శ్రీదేవి డ్రామా కంపెనీ షో కూడా చేస్తుంది. ముఖ్యంగా తన అందచందాలతో యువతకు చాలా దగ్గరైంది వర్ష. ఆమె కరోనా నుండి త్వరగా కోలుకోవాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు.