అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొవిడ్-19 వ్యాప్తి కొనసాగుతోంది. రోజు రోజుకీ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 3495 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల చిత్తూర్లో నలుగురు చనిపోగా, గుంటూరు, కర్నూల్, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 925401కు చేరింది. ప్రస్తుతం 20954 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7300కు పెరిగింది.