వీడి చర్యలు ఊహాతీతం అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ వర్మకు కరెక్ట్గా యాప్ట్ అవుతుందేమోనని అనిపిస్తుంది. వర్మ తీసే సినిమాలు, ఆయన చేసే పనులు అన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. బంధాలు బాధ్యతల గురించి కూడా పట్టని వర్మ తన చావును కూడా చాలా లైట్ తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఏ విషయాన్ని చాలా లైట్ తీసుకునే వర్మ చావుని కూడా లైట్ తీసుకుంటానని అనడం అందరు షాకయ్యేలా చేస్తుంది.
తాజాగా ఇంటర్వ్యూలో నాకు భయం ఏంటో తెలియదు.అందరం ఎప్పుడో ఒకసారి చనిపోయే వాళ్లమే కదా, దానికి ఆందోళన ఎందుకంటూ సరికొత్త థియరీ చెప్పుకొచ్చాడు వర్మ . నేను చనిపోతున్న సమయంలో అణుబాంబు పేలుడును చూడాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు చనిపోతున్న సమయంలో ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. కాని రామ్ గోపాల్ వర్మ మాత్రం తన చావు అత్యంత భయంకరంగా ఉండాలని.. ప్రతి ఒక్కరు భయపడే దాన్ని చూస్తూ తాను చనిపోవాలనుకోవడం ఆయన తీరుకు నిదర్శణం అనడంలో సందేహం లేదు.