శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉండటంతో హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారు. మహిళలు సామూహికంగా వ్రతక్రతువులో పాల్గొని అమ్మవారికి పంచామృత అభిషేకాలు, సహస్రనామార్చనలు, కుంకుమ పూజలు నిర్వహిస్తుంటారు.
ఆగస్ట్20న వరలక్ష్మీ వ్రతం కాగా, శ్రావణ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన శుక్రవారం సందర్భంగా మహిళలు ఈ వ్రతం ఆచరిస్తారు. సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఈ వ్రతం చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రత శోభ వెల్లివిరిసింది. మెగాస్టార్ చిరంజీవి నివాసంలోనూ శ్రావణ శుక్రవారం కళ ఉట్టిపడింది.
చిరంజీవి నివాసంలోనూ వరలక్ష్మి వ్రతం ఆచరించగా, నాలుగు తరాల స్త్రీల సమక్షంలో ఈ వేడుక జరిగిందని ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసిది. వ్రతంలో చిరంజీవి తల్లి అంజనాదేవి, భార్య సురేఖ, కోడలు ఉపాసన, శ్రీజ కుమార్తె దర్శనమిచ్చారు.