పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న ప్రాజెక్టు వకీల్సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వకీల్ సాబ్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ‘మీరు వర్జినేనా చెప్పండి..’అని ప్రకాశ్రాజ్ బాధితురాలు నివేదాను ప్రశ్నించే సీన్ తో ప్రారంభమైన ట్రైలర్..ఆ తర్వాత మిగిలిన ఇద్దరు బాధితురాళ్ల విచారణ, ప్రకాశ్ రాజ్, పవన్కల్యాణ్ మధ్య వాడివేడిగా సాగే వాదనలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది.
కోర్టు రూం డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న వకీల్సాబ్లో శృతిహాసన్, నివేదా థామస్, అంజలి ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బోనీ కపూర్ ఫిలిమ్స్ బ్యానర్లపై దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రానా ‘అరణ్య’ ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
వకీల్ సాబ్ బెనిఫిట్ షో టికెట్ ఎంతో తెలుసా..?
ప్రభాస్ తర్వాత రామ్ చరణ్ : పాన్ ఇండియన్ స్టార్గా ప్రమోషన్