ముంబై: కరోనాతో రాజకీయ ప్రముఖులు బలవుతున్నారు. తాజాగా మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎక్నాథ్ గైక్వాడ్ కరోనాతో మృతిచెందారు. కరోనా బారినపడిన ఆయన ముంబైలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం 10 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన కూతురు వర్షా గౌక్వాడ్ ప్రస్తుతం మహారాష్ట్ర ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.
ముంబై సౌత్ సెంట్రల్ నియోజకర్గం నుంచి ఏక్నాథ్ గైక్వాడ్ రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు. ఆసియాలో అతిపెద్ద మురికివాడ అయిన ధారావి నియోజకవర్గం ఎమ్మెల్యేగా 1985 నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ముంబై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..