పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ ఏప్రిల్లో విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. హిందీ చిత్రం పింక్ రీమేక్గా తెరకెక్కిన ఈ మూవీని తెలుగు నేటివిటీకి అనుగుణంగా రూపొందించారు వేణు శ్రీరామ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన శృతిహాసన్ కథానాయికగా నటించగా, ఇందులో అనన్య,అంజలి, నివేదా థామస్ ముఖ్య పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలోనే కాకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలై కూడా మంచి విజయాన్ని అందుకుంది.
కరనా వలన ఈ చిత్రాన్ని ఎక్కువ రోజులు థియేటర్ లో ప్రదర్శించలేకపోయారు.ఇప్పుడు థియేటర్స్ తిరిగి తెరచుకున్నాక కొత్త సీన్స్తో కలిపి వకీల్ సాబ్ మూవీని రీరిలీజ్ చేయనున్నట్టు కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. కాని దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఈ మూవీ త్వరలో ‘జీ తెలుగు’లో ఈ చిత్రం టెలికాస్ట్ కాబోతోంది. ఈ విషయం తెలుపుతూ ‘జీ తెలుగు’ చానెల్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్ను విడుదల చేసింది. ‘గుండెతో స్పందిస్తాడు … అండగా చెయ్యందిస్తాడు’ అని తెలుపుతూ విడుదల చేసిన ఈ పోస్టర్లో ‘వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్’గా త్వరలోనే జీ తెలుగులో ఈ చిత్రం రాబోతోంది అని తెలియజేశారు. జూలై 18 సాయంత్రం ఆరు గంటలకు బుల్లితెరపై వకీల్ సాబ్ ప్రసారం కానుంది.