హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్గా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వరుసగా మూడోసారి నిమితులయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు యువజన, పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పాటైన నాటినుంచి రసమయి దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ పదవిలో ఆయన మరో మూడేండ్లపాటు కొనసాగనున్నారు. సాంస్కృతిక సారథి చైర్మన్గా తనకు మరోసారి అవకాశం కల్పించడంపై రసమయి బాలకిషన్ ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేతులమీదుగా నియామకపత్రాన్ని అందుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన సాంస్కృతిక కళాకారులకు అండగా నిలిచేందుకు వారికి ఉద్యోగాలిచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు సాంస్కృతిక సారథిలో అందరికీ అవకాశం కల్పిస్తూ చేపట్టిన ప్రక్రియ ఇటీవలే పూర్తయిందని పేరొన్నారు. రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పాత్ర గొప్పదని కొనియాడారు. దేశానికే ఆదర్శంగా, రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి పథకాల సమాచారాన్ని మారుమూల ప్రాంతాలకు చేర్చేలా రసమయి కృషిచేయాలని సూచించారు. సాంస్కృతిక సారథిగా తెలంగాణ అభివృద్ధిపై ‘ప్రగతి ధూంధాం’ పేరుతో కళా ప్రదర్శనలు చేస్తానని రసమయి తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.