రాయలసీమ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల చక్కటి పాఠకాదరణ సొంతం చేసుకోవడంతో పాటు సాహితీప్రపంచం ప్రశంసలందుకుంది. ఈ నవల ఆధారంగా దర్శకుడు క్రిష్ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. వైష్ణవ్తేజ్, రకుల్ప్రీత్సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘కొండపొలం’ అనే టైటిల్ను ఖరారు చేశారు. శుక్రవారం ఫస్ట్లుక్తో పాటు వీడియాగ్లింప్స్ను విడుదల చేశారు. ఇందులో వైష్ణవ్తేజ్ గడ్డంతో రఫ్లుక్లో కనిపిస్తున్నారు. ‘ఎపిక్ టేల్ ఆఫ్ బికమింగ్’ అనే క్యాప్షన్తో పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. నల్లమల అడవిలో సామాన్య గొర్రెలకాపరులు చేసే సాహసోపేతమైన జీవనపోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం. అక్టోబర్ 8న థియేటర్స్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వి.ఎస్, సంగీతం: కీరవాణి, ఆర్ట్: రాజ్కుమార్ గిబ్సన్, నిర్మాణ సంస్థ: ఫస్ట్ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్రెడ్డి, కథ: సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి.