‘యాక్టింగ్లో ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. లఘు చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది. కేవలం కథానాయికగానే కాకుండా అభినయానికి ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమే’ అని చెప్పింది వైశాలిరాజ్. ఆమె కథానాయికగా పరిచయమవుతున్న చిత్రం ‘కనబడుటలేదు’. సునీల్, సుక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. బాలరాజు ఎం దర్శకుడు. ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా వైశాలిరాజ్ మాట్లాడుతూ ‘నా అసలు పేరు కవిత. మా స్వస్థలం విశాఖపట్నం. షార్ట్ఫిల్మ్లో నా నటన చూసి దర్శకుడు ఈ సినిమా అవకాశమిచ్చారు. ఇందులో మధ్యతరగతి అమ్మాయి పాత్రలో నటించాను. భిన్న భావోద్వేగాలతో నా పాత్ర సాగుతుంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఉత్కంఠను పంచుతుంది. సునీల్తో నటించడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో దర్శకత్వం చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నా. దీపికాపడుకోన్, నయనతార, సమంత నా అభిమాన నాయికలు. వారు ఎంపిక చేసుకునే పాత్రలు బాగా నచ్చుతాయి’ అని చెప్పింది.