హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ దుందుభి మోగించడంతో శ్రేణుల సంబురాలు మిన్నంటాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ గా ఎస్ వాణీదేవి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్రెడ్డి విజ యం ఖరారు కావడంతో శనివారం సాయం త్రం నుంచి రాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబురా ల్లో మునిగిపోయారు. హైదరాబాద్లోని నాయకు లు, కార్యకర్తలు తెలంగాణ భవన్కు చేరుకొని పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. డప్పులు వాయిస్తూ డ్యాన్స్ చేశారు.
పటాకులు పేల్చడంతో నిప్పురవ్వలు ఎగిరి భవనం ఆవరణలో వేసిన చలువ పందిళ్లపై పడటంతో మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది రెండో అంతస్తు నుంచి నీళ్లు చల్లడంతో మంటలు ఆరిపోయాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నేతృత్వంలో కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, మన్నె కవిత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నాయకులు మన్నె గోవర్ధన్రెడ్డి, కట్టెల శ్రీనివాస్యాదవ్, టీఆర్ఎస్ యువజన సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నా రు. కరీంనగర్తోపాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో నూ పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకొన్నారు.