నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందిందని, 60 ఏండ్ల ప్రగతిని కేవలం ఆరేండ్లలోనే చూపించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము అన్నారు. మంగళవారం పట్టణంలోని శాస్త్రినగర్లోని మంత్రి నివాసంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ఏర్పాటులో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాత్ర ఎంతో ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, సురేందర్ రెడ్డి, దేవరకోట ఆలయ చైర్మన్ లక్ష్మీనారాయణ, మాజీ చైర్మన్ ఆమెడ కిషన్, కౌన్సిలర్ గండ్రత్ రమణ, నాయకులు నాలం శ్రీనివాస్, వేణు, అప్పాల వంశీ, నర్సయ్య, ధర్మాజీ శ్రీనివాస్, సుంకరి ఆనంద్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్ టౌన్, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఖానాపూర్లోని తెలంగాణ చౌరస్తాలో గులాబీ జెండాను ఎగుర వేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిరాడంబరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ సారథ్యంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పరిమి సురేశ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ పూలమాలలు వేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ కలీల్, పార్టీ మండలాధ్యక్షుడు రాజగంగన్న, ప్రధాన కార్యదర్శి తూము చరణ్, కౌన్సిలర్ కావలి సంతోష్, నాయకులు డాక్టర్ కేహెచ్ ఖాన్, కొడిమ్యాల వీరేశ్, గోగికర్ రాజు, కౌట మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్ రూరల్, ఏప్రిల్ 27: రాజూరా, గోడలపంపు, తర్లపాడ్, సోమార్పేట్, బీర్నంది గ్రామాల్లో పార్టీ గ్రామాధ్యక్షులు జెండాలను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. కార్యక్రమాల్లో ఎంపీటీసీ రాజు, నాయకులు రామిడి మహేశ్, పెద్ది మల్లేశ్, సత్యనారాయణ, పెద్దిరాజు, రాజేశ్వర్, శ్రీనివాస్, ఎస్ఆర్కే శ్రీనివాస్ పాల్గొన్నారు.
మామడలో..
మామడ, ఏప్రిల్ 27: మండల కేంద్రంతో పాటు కొరిటికల్ గ్రామంలో మంగళవారం టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాకాల చంద్రశేఖర్గౌడ్, మామడ సర్పంచ్ హన్మాగౌడ్, నాయకులు నల్ల లింగారెడ్డి,మేకం అశోక్, రాజేశ్వర్, శ్రీనివాస్, నరేశ్రెడ్డి, చిన్నారెడ్డి, మేక రఘు, అలీం, పాషా ఉన్నారు.
కుభీర్లో..
కుభీర్, ఏప్రిల్27: అనతికాలంలోనే తిరుగులేని శక్తిగా ఎదిగి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకొని బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్న టీఆర్ఎస్ పార్టీ నేటితో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుందని నాయకులు పేర్కొన్నారు. మంగళవారం టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కుభీర్లోని సేవాలాల్ చౌక్లో తెలంగాణ తల్లి విగ్రహానికి టీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేశారు. పార్టీ మండలాధ్యక్షుడు ఎన్నీల అనిల్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ తూం లక్ష్మి, వైస్ ఎంపీపీ మోహియొద్దీన్, విద్యావంతుల వేదిక అధ్యక్షుడు పానాజీ విజయ్కుమార్, నాయకులు తూము రాజేశ్వర్, శంకర్ చౌహాన్, రేకుల గంగాచరణ్, ఉప సర్పంచ్ ఇక్రమొద్దీన్, ఎంపీటీసీలు దాసరి మల్లారెడ్డి, దొంతుల దేవీదాస్, కందూర్ సంతోష్, పుప్పాల పీరాజీ, సూది రాజన్న, గోనె కళ్యాణ్, గంధం పోశెట్టి, బొప్ప నాగలింగం, దొంతుల గంగాధర్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.