తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితం అయిన ఉత్తేజ్ ఇంట్లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ సతీమణి అయిన పద్మావతి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఉత్తేజ్ సతీమణి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో మృతి చెందారు. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా, ఉత్తేజ్కు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు.
నటుడిగా, రచయితగా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించిన ఉత్తేజ్ తొలి సారిగా శివ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. రామ్ గోపాల్ వర్మ ప్రతి సినిమాలో కనిపించి మెప్పించాడు. శివలో యాదగిరి అనే పాత్రతో ఆకట్టుకున్న ఉత్తేజ్.. గాయం, అనగనగా ఒకరోజు చిత్రాలలోనూ యాదగిరిగానే కనిపించి ఆకట్టుకున్నారు.
ఆయన పెద్ద కూతురు చేతన 2017లో పిచ్చిగా నచ్చావ్ అనే చిత్రంతో హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయింది. ఆ సినిమా ప్లాప్ కావడంతో కొరియోగ్రాఫర్గా సత్తా చాటుతుంది. చిన్న కూతురు పాటకి కూడా మంచి టాలెంట్ ఉంది. ఈ మధ్య అకీరా నందన్ పియానో వాయిస్తూ ఉండగా, పాట అద్భుతంగా పాడి అలరించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.