సెకండ్వేవ్ తగ్గుముఖం పట్టడంతో గత కొద్ది వారాలుగా దేశవ్యాప్తంగా సినిమా చిత్రీకరణలు ఊపందుకున్నాయి. కొవిడ్ నిబంధనల్ని పాటిస్తూ షూటింగ్స్ జరుపుతున్నారు. అయితే ఇంతటి కఠినమైన నియమాల నడుమ షూటింగ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉందని బాలీవుడ్ కథానాయిక ఊర్వశి రౌటేలా పేర్కొంది. ‘బ్లాక్రోజ్’ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన ఈ భామ ప్రస్తుతం ‘ఇన్సెక్టర్ అవినాష్’ వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఈ సందర్భంగా ఆంక్షల మధ్య షూటింగ్ అనుభవాల గురించి ఆమె మాట్లాడుతూ ‘కరోనా నిబంధనల వల్ల షూటింగ్ అంతా ఓ పజిల్లా కనిపిస్తోంది. సెట్లో అడుగుపెట్టగానే చేసే పరీక్షలు మొదలుకొని తిరిగి బయటికొచ్చేవరకు అడుగడుగునా ఆంక్షల మధ్యే ఉండాల్సి వస్తోంది.
సినిమా అంటేనే ఓ టీమ్ వర్క్ కాబట్టి సెట్లో భౌతికదూరం పాటించడం చాలా కష్టమైన విషయం. ముఖ్యంగా దూరంగా నిల్చొని మాట్లాడటం ఇబ్బందిగా అనిపిస్తోంది’ అని చెప్పింది. అయితే ప్రపంచవ్యాప్తంగా షూటింగ్ల విషయంలో ఇవే రక్షణ చర్యల్ని తీసుకుంటున్నారని, సినీరంగం ముందుకుపోవాలంటే క్లిష్టమైన పరిస్థితులకు అలవాటుపడక తప్పదని ముక్తాయించింది ఊర్వశి రౌటేలా. లక్నో పోలీస్ అధికారి అవినాష్ మిశ్రా జీవితకథ ఆధారంగా ‘ఇన్స్సెక్టర్ అవినాష్’ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు. రణదీప్హుడా టైటిల్ రోల్ని పోషిస్తున్నారు.