హైదరాబాద్: ఏపీలోకి ప్రవేశించే అంతరాష్ట్ర చెక్పోస్ట్ల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఏపీలోకి ప్రవేశించే వాహనాలను అక్కడి పోలీసులు నిలిపివేస్తున్నారు. గరికపాడు వద్ద గల ఏపీ-తెలంగాణ అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు జరుగుతున్నాయి. అనుమతులు ఉన్న వాహనాలను ఏపీ లోకి అనుమతిస్తున్నారు. అనుమతులు లేని వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. కోవిడ్ విజృంభిస్తున్న కారణంగా ఏపీలో నేటి మధ్యాహ్నం 12 నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. బార్డర్ చెక్పోస్ట్ దగ్గర ఏపీ పోలీసులు ఆర్టీసీ బస్సులను, ఇతర వాహనాలను పూర్తిగా నిలిపివేస్తున్నారు.
అత్యవసర, సరుకు రవాణా వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు.