బెంగళూర్ : కర్నాటకలో నాయకత్వ మార్పుపై సాగుతున్న ఊహాగానాలను ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తోసిపుచ్చారు. ఏ ఒక్కరో ఢిల్లీకి వెళ్లినంత మాత్రాన ఏదో జరుగుతోందని అర్ధం కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు కోరుతున్న వారికి దీటైన జవాబిచ్చి వెనక్కి పంపారని చెప్పుకొచ్చారు. కొవిడ్-19పై పోరాటమే తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు.
వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసిరావాలని కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కొవిడ్-19 కట్టడిపై మరింత శ్రద్థ కనబరచాలని అన్నారు. మరోవైపు మరో రెండేండ్లలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకూ యడియూరప్పే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. ఇక యడియూరప్ప నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు జూన్ 7న సమావేశానికి పిలుపు ఇవ్వడం కన్నడ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.