2021లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో లాభాల పరంగా చూసుకుంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఉప్పెన. సుకుమార్ శిష్యుడు, కొత్త దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 51 కోట్ల షేర్ వసూలు చేసింది. ఫిబ్రవరి 12న విడుదలైన ఉప్పెన ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. డెబ్యు హీరోకు ఇండియాలో ఇదే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. వైష్ణవ్ తేజ్ ఇంతకంటే డ్రీమ్ డెబ్యూ అస్సలు కోరుకుని ఉండడేమో..? అంతగా విజయం సాధించింది ఉప్పెన. ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించారు. ఆశిగా వైష్ణవ్.. బేబమ్మగా కృతి తమ నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.
ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది. సినిమా సూపర్ హిట్ కావడంలో దేవి హ్యాండ్ కూడా ఉంది. శ్యామ్ దత్ బ్రిలియంట్ విజువల్స్, బుచ్చిబాబు సన రైటింగ్ పవర్ ఉప్పెన సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాయి. ఈ సినిమాలో విజయ్ సేతుపతి పోషించిన రాయనం పాత్ర కూడా సంచలనమే. ఈయన కారెక్టర్ తోనే సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఇండస్ట్రీలో కూడా చాలా మంది ప్రశంసలు అందుకున్నాడు బుచ్చిబాబు. ఓ సున్నితమైన పాయింట్ ను తీసుకుని అద్భుతంగా స్క్రీన్ పై ప్రజెంట్ చేసాడంటూ బుచ్చిబాబును పొగిడేసారు అంతా. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా టీవీలో కూడా సంచలనం రేపింది.
థియేటర్స్ లో 50 రోజులు ఆడిన ఈ చిత్రం ఈ మద్యే నెట్ ఫ్లిక్స్ లోనూ విడుదలైంది. అక్కడ మంచి వ్యూస్ సాధిస్తుంది. ఈ మధ్యే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ పేరుతో స్టార్ మాలో ఉప్పెన సినిమాను టెలికాస్ట్ చేసారు. అక్కడ ఏకంగా 18.5 రేటింగ్ సాధించింది ఈ చిత్రం. డెబ్యూ హీరోల సినిమాలకు ఇది ఆల్ టైమ్ రికార్డ్. డిజిటల్ ప్రింట్ విడుదలైన తర్వాత కూడా ఈ సినిమాకు ఇంత ఆదరణ దక్కడం నిజంగానే అద్భుతం అని చెప్పాలి. ఏదేమైనా కూడా తొలి సినిమాతో చరిత్ర సృష్టించాడు మెగా మేనల్లుడు.
ఇవి కూడా చదవండి..