లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్లో భారత స్టార్ సానియా మీర్జా ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది. సీనియర్ ప్లేయర్ రోహన్ బోపన్నతో కలిసి బరిలోకి దిగిన సానియా అదరగొట్టింది. రెండో రౌండ్లో మీర్జా-బోపన్న ద్వయం 6-3, 6-1తో బ్రిటన్ జోడీ ఆడియన్ మెక్హ్యూజ్, విబ్లే స్మిత్ను చిత్తుచేసింది. 47 నిమిషాల్లోనే ముగిసిన పోరులో.. సానియా జంట పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మరోవైపు వింబుల్డన్ సెంటర్, ఒకటో నెంబర్ కోర్టులు సోమవారం నుంచి వంద శాతం ప్రేక్షకులతో కళకళలాడే అవకాశముంది. ఈ కోర్టుల్లో జరిగే క్వార్టర్ ఫైనల్స్ నుంచి ఫైనల్స్ వరకు పూర్తిస్థాయిలో అభిమానులను అనుమతించనున్నట్టు ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రకటించింది.