కాఠ్మండు, మే 5: నేపాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడే దిశగా అడుగులు పడుతున్నాయి. దిగువసభలో ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. మాజీ ప్రధాని పుష్పకమాల్ దహాల్ ప్రచండ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (సీపీఎన్) (మావోయిస్ట్ సెంటర్) మద్దతును ఉపసంహరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఓలీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న కొన్ని చర్యలు ప్రజాస్వామ్య విలువలకు, దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ఉన్నాయని సీపీఎన్ (మావోయిస్ట్ సెంటర్) ఆరోపించింది. సోమవారం ఓలీ ప్రభుత్వం పార్లమెంటులో విశ్వాసపరీక్షను ఎదుర్కోనుంది.