దక్షిణాది ఫేమస్ నటుడు రాజన్ పి దేవ్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. ఆది, దిల్, ఒక్కడు, ఖుషి, గుడుంబా శంకర్ లాంటి సినిమాలలో నటించారు. 2019లో అనారోగ్యంతో మరణించారు. అయితే తండ్రి పేరు నిలబెట్టాల్సిన కుమారుడు వివాదాల వలన కటకటాలు లెక్కబెడుతున్నాడు. రాజన్ కుమారుడు ఉన్నా రాజన్ తన భార్యను హింసించడం, ఆత్మహత్యకు ఉసిగొల్పడం చేస్తున్న నేపథ్యంలో నెడుమంగడ్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆయనను అరెస్ట్ చేయాల్సి ఉన్నప్పటికి కరోనా పాజిటివ్ రావడంతో నెగెటివ్ రిపోర్ట్ వచ్చే వరకు ఆగారు.
2019లో ప్రియాంక అనే యువతిని ఉన్ని రాజన్ వివాహం చేసుకోగా, అప్పటి నుండి ఆమెను వేదిస్తున్నాడని ప్రియాంక తల్లి చెబుతోంది. అదనపు కట్నంతో పాటు ఇతర కారణాలతో చాలా హింసించేవాడని, ఓ సారి గొడవ మధ్యలో నేను అడ్డుగా వెళ్లినందుకు నాపై కూడా చేయి చేసుకున్నాడని ప్రియాంక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మే పదకొండున ఉన్ని ఇంట్లో గొడవ జరిగిందని, వెంటనే పుట్టింటికి ప్రియాంక ఇంటికి వచ్చేసింది. ఆ మరుసటిరోజే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, ఉన్నిరాజన్ కూడా నటుడే. కమెడియన్గా, విలన్గా దాదాపు ముప్ఫైదాకా మలయాళ చిత్రాల్లో నటించాడు.