సెప్టెంబర్ 5న గ్రాండ్గా లాంచ్ అయిన బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్న విషయం తెలిసిందే. తొలివారం సరయు ఎలిమినేట్ కాగా, రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై చర్చ నడుస్తుంది. ప్రస్తుతం నామినేషన్లో ఉమ, నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, అనీ మాస్టర్, ప్రియ ఉన్నారు. వీరిలో ఉమా దేవీనే ఎక్కవుగా టార్గెట్ అయినట్టు తెలుస్తుంది.
‘కార్తీకదీపం’ఫేమ్ ఉమా దేవి వచ్చిన రోజు నుండి ఎవరో ఒకరితో గొడవ పడడం, ఎడ్డం అంటే తెడ్డం అనడం, నాకు నచ్చిందే నేను చేస్తా అంటూ కాస్త తేడాగా ప్రవర్తిస్తుండడం కూడా ప్రేక్షకులకి విసుగు తెప్పిస్తుంది. మొదటి వారం నామినేషన్లో ఉంటే ఆమె పక్కా ఎలిమినేట్ అయ్యేదని అన్నారు. ఇప్పుడు సెకండ్ వారం నామినేషన్లో ఉండడంతో ఆమె ఎలిమినేషన్ పక్కా అంటూ జోస్యాలు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో సైతం ఆమెనే ఎలిమినేట్ అవుతుందని పోస్ట్లు పెడుతున్నారు. గత రెండు సీజన్లో కూడా కరాటే కల్యాణి, హేమలు పెత్తనం చలాయించాలని చూసి చేతులు కాల్చుకొని త్వరగా హౌజ్ నుండి బయటకు వెళ్లారు. ఇప్పుడు ఉమా దేవి కూడా అదే చేస్తుంది. పెద్దావిడ అన్న విషయం కూడా మర్చిపోయి బూతులు కూడా మాట్లాడుతుంది. ఇది కంటెస్టెంట్స్తో పాటు ప్రేక్షకులకి కూడా రుచించడంలేదు. ఈ వారం ఆమె ఎలిమినేషన్ పక్కా అని తెగ ప్రచారం చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!