రామవరం, ఏప్రిల్ 7: లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న వర్మా అజయ్కుమార్(28) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. పిన్ని కూతురిపై లైంగిక దాడి చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అజయ్కుమార్ మనస్తాపంతో భద్రాది జిల్లా రామవరంలోని తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు చేసుకున్నాడు. తనపై తోడబుట్టిన సోదరుడు సుశీల్కుమార్, పెద్దమ్మ కుమారుడు వర్మా అజయ్కుమార్ కొంతకాలంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ఓ యువతి 2టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సుశీల్, అజయ్తోపాటు వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. దీంతో మనస్తాపానికి గురైన అజయ్కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తున్నది. ఆ యువతి అసత్య ఆరోపణలతో ఫిర్యాదు చేయ డం వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్టు అజయ్కుమార్ తండ్రి రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అజయ్ గతంలో బెంగుళూరులో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశాడని, లాక్డౌన్ సమయం నుంచి ఖాళీగా ఇంటివద్దనే ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మాసాయిపేటను ముద్దాడనున్న గోదావరి
అంతర్జాతీయ జర్నల్లో మన పోలీస్ ఆర్టికల్
మా సర్వీసును క్రమబద్ధీకరించండి