హైదరాబాద్ : రాష్ట్రంలోని అర్హులైన రైతుల ఖాతాల్లో ఎల్లుండి నుంచి రైతుబంధు పథకం కింద నగదు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది రైతుబంధు పథకానికి 63.25 లక్షల మంది రైతులను సర్కారు అర్హులుగా గుర్తించింది. ఈ మేరకు అర్హుల తుది జాబితాను సీసీఎల్ఏ వ్యవసాయశాఖకు అందజేసింది. 63 లక్షల 25 వేల 695 మందికి రైతులకు చెందిన (150.18 లక్షల ఎకరాలకు) రైతుబంధు సాయం అందించేందుకు రూ. 7508.78 కోట్లు అవసరమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈసారి కొత్తగా 2.81 లక్షల మందికి రైతుబంధు పథకం వర్తింపజేశామని ఆయన వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.