ప్రతి ఏడాది రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులని అలరించే నానికి కరోనా పెద్ద దెబ్బ కొట్టింది. గత ఏడాది కరోనా వలన నాని నటించిన వి చిత్రం తప్పని పరిస్థితులలో ఓటీటీలో విడుదలైంది. ఇక తాజాగా ఆయన నటించిన టక్ జగదీష్ చిత్రం కూడా కరోనా వలన ఓటీటీలో విడుదల అవుతుందని జోరుగా ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలో టక్ జగదీష్ మేకర్స్ స్పందించారు. మూవీని ఎట్టి పరిస్థితులలో థియేటర్లోనే విడుదల చేస్తామని అంటున్నారు.
ఫ్యామిలీ డ్రామా నేపథ్యంతో తెరకెక్కుతున్న ‘టక్ జగదీశ్’ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఐశ్వర్యా రాజేష్, రీతూ వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.కరోనా పరిస్థితులు చక్కబడ్డాక మూవీ రిలీజ్ ఎప్పుడన్నది ప్రకటించే అవకాశం ఉంది.