అమీర్పేట్, జూలై 6 : బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ నూతన పాలకమండలి మంగళవారం కొలువుదీరింది. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులుగా నియమితులైన వారితో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆలయ పవిత్రతను కాపాడతామంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కమిటీలో చైర్మన్గా కొత్తపల్లి సాయిబాబాగౌడ్ (ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు), సభ్యులుగా బీ.ఆర్.నారాయణరాజు, నాయిని శ్రీనివాస్గౌడ్, బసా లక్ష్మి, కట్టా బలరామ్, పుట్టల శేఖర్, కాండ్రాజు సుబ్బరాజు, కాసాని సహదేవ్గౌడ్, కొలను భూపాల్రెడ్డి, పి.అశోక్కుమార్యాదవ్, ముత్యాల హనుమంతరావు, బి.ఉమానాథ్గౌడ్, సింగారపు శ్రీనివాస్ గుప్తా, ఎం.ఆంజనేయులు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ చారిత్రక నేపథ్యం ఉన్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్టను మరింత పెంచేలా నూతన కమిటీ ప్రతినిధులు నడుచుకోవాలని సూచించారు.