కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఇప్పుడు అందరి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. సెలబ్రిటీలు సైతం ఈ కరోనా బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కరోనా బారిన పడగా, ఆయన క్వారంటైన్లో ఉండి వైద్యం తీసుకుంటున్నారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కరోనా బారిన పడ్డారట. ఈ విషయం చాలా మందికి తెలియదు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా త్రివిక్రమ్కు పాజిటివ్ అని తేలిందట.
కరోనా బారిన పడిన తర్వాత త్రివిక్రమ్ ఇంట్లో ఉంటూనే చికిత్స తీసుకున్నారు. పదకొండు రోజుల తర్వాత ఆయన పూర్తిగా కోలుకున్నారని ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని ఫిలిం నగర్ టాక్. వారం తర్వాత ఆయన తిరిగి తన పనులను మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చిత్రానికి మాటలు అందిస్తున్న త్రివిక్రమ్ త్వరలో ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఆ తర్వాత మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నాడు.