నవతరం కథానాయికల పోటీ కారణంగా అవకాశాల రేసులో వెనుకబడిపోయింది చెన్నై సొగసరి త్రిష. గత కొంతకాలంగా టాలీవుడ్కు దూరంగా ఉంటోన్న ఆమె తమిళచిత్రసీమపై దృష్టిపెట్టింది. తాజాగా ఈ సొగసరి ఏడేళ్ల విరామం తర్వాత కన్నడంలో పునరాగమనం చేయబోతున్నది. పునీత్ రాజ్కుమార్ కథానాయకుడిగా పవన్కుమార్ దర్శకత్వంలో (‘యూటర్న్’ ఫేమ్) ‘ద్విత్వ’ పేరుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో త్రిషను హీరోయిన్గా చిత్రబృందం ఎంపికచేసింది. గ్లామర్ హంగులకు భిన్నంగా వైవిధ్యమైన షేడ్స్తో త్రిష పాత్ర సాగుతుందని చెబుతున్నారు. విజయ్ కిర్గందూర్ నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్లో సెట్స్పైకిరానున్నది. పునీత్ రాజ్కుమార్ నటించిన ‘పవర్’తో కన్నడంలో తెరంగేట్రం చేసిన త్రిష అతడి సినిమాతోనే ఏడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతుండటం గమనార్హం.