సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కు డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు త్రినాథరావు నక్కిన. ప్రస్తుతం రవితేజ చేయబోతున్న ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జర్నీ విషయాలను షేర్ చేసుకున్నాడీ రైటర్ కమ్ డైరెక్టర్. హిట్ డైరెక్టర్లు సినిమాకు గ్యాప్ తీసుకుంటారు. కానీ ప్లాప్ డైరెక్టర్లు వెంటనే సినిమాలు చేస్తుంటారు ఎందుకని త్రినాథరావు ను ప్రశ్నించారు.
దీనికి ఆయన స్పందిస్తూ..కొందరు డైరెక్టర్లు సినిమాకు టైం తీసుకోవడానికి ఇష్టపడతారు. కొందరేమో వెంటనే సినిమాలు చేస్తుంటారు. మరికొందరేమో పర్ఫెక్ట్ గా సినిమా రావడంపై ఫోకస్ పెడతారు. నేను మూడో రకం. పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేస్తానని చెప్పారు. నేను తొలుత రైటర్. ఆ తర్వాత డైరెక్టర్ అయ్యా. నేను అనకాపల్లిలో చదువుతున్నపుడు రంగస్థల నాటకాల్లో నటించేవాడిని. అప్పటి నుంచి డైరెక్టర్ గా మారడమే నా లక్ష్యం. నేను స్టోరీలు రాస్తూనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పుకొచ్చాడు.