కరోనా మహమ్మారి సృష్టిస్తున్న ప్రళయం వలన సినీ ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా మారింది. లాక్డౌన్ వలన థియేటర్స్ మూతపడగా ఇవి తిరిగి తెరచుకునేందుకు ఇంకాస్త సమయం పట్టేలా కనిపిస్తుంది. డెల్టా వైరస్ తాకిడి నేపథ్యంలో ధియేటర్లను ఇప్పట్లో తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో పలువురు హీరోలు తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రీసెంట్గా వెంకటేష్ నటించిన నారప్ప చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దృశ్యం 2 సినిమా కూడా ఓటీటీలో విడుదల కానుందని ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలో వరంగల్ కు చెందిన అల్లుడు కిరణ్ తమ అభిమాన హీరో వెంకటేష్ సినిమా నారప్పను థియేటర్లోనే చూడాలని కోరుకుంటున్నాడు. ఓటీటీ రిలీజ్కు వ్యతిరేఖంగా ఒక రోజు నిరాహార దీక్ష కూడా చేశాడట. వెంకీ సినిమాలను థియేటర్లోనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.