దసరా పండగ (Dussehra festival) వచ్చిందంటే ఖచ్చితంగా కొత్త సినిమాలు ఢీ కొడుతుంటాయి. పైగా ఈ మధ్య కాలంలో కరోనా కారణంగా ఎన్నో సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. అందుకే రాకరాక వచ్చిన సెలవులను చాలా మంది దర్శక నిర్మాతలు సరిగ్గా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్నింటికి మించి ఈ మధ్య థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు మంచి వసూళ్లు తీసుకొస్తున్నాయి. దాంతో నిర్మాతలకు ధైర్యం వచ్చింది. కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా కలెక్షన్స్ కూడా వస్తాయని వారు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి వారం కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. అయితే లవ్ స్టోరీ తర్వాత బాక్సాఫీస్ దగ్గర మళ్లీ ఆ స్థాయిలో మోత మోగించిన సినిమా రాలేదు.
భారీ అంచనాల మధ్య విడుదలైన సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్.. వైష్ణవ్ తేజ్ కొండ పొలం సినిమాలు కమర్షియల్ గా ఆకట్టుకోలేదు. ఇలాంటి సమయంలో దసరాపైనే నిర్మాతల కన్ను ఉంది. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లు దసరా సినిమాలతో మళ్లీ గాడిన పడాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరాకు విడుదల కానున్న మొదటి సినిమా మహా సముద్రం. అక్టోబర్ 14న శర్వానంద్ (Sharwanand), సిద్ధార్థ్ (Siddharth) హీరోలుగా అజయ్ భూపతి తెరకెక్కించిన మహా సముద్రం భారీ స్థాయిలో విడుదలవుతుంది. దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మరోవైపు అక్టోబర్ 15న అఖిల్ (Akhil Akkineni) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ విడుదల కానుంది. ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేని అఖిల్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి.
బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. మరోవైపు అదే రోజు శ్రీకాంత్ తనయుడు రోషన్ (Roshan Srikanth) హీరోగా వస్తున్న పెళ్లిసందD విడుదల కానుంది. కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా రెండు రోజుల్లో 3 భారీ సినిమాలతో దసరాకు సినీ అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం.
ఇవి కూడా చదవండి..
Esha Gupta: పైన మొత్తం విప్పేసి ఇలా రచ్చ చేస్తుందేంటి?