సన్రైజర్స్ హైదరాబాద్తో బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్
బెంగళూరు( ఆర్సీబీ) 6 పరుగులతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్వెల్ (59: 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో చెలరేగాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మాక్సీ విలువైన ఇన్నింగ్స్తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. గతేడాది సీజన్లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన మాక్స్వెల్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ వదిలేసింది. ఐపీఎల్ 2021 కోసం నిర్వహించిన వేలంలో అతన్ని బెంగళూరు కొనుగోలు చేసింది.
ఐతే ఈసారి మాక్సీ తొలి మ్యాచ్తోనే టచ్లోకి వచ్చాడు. ముంబై ఇండియన్స్తో పోరులో 39 రన్స్ చేశాడు. సన్రైజర్స్తో మ్యాచ్లో హాఫ్సెంచరీతో రాణించాడు. ఐపీఎల్లో 50 మార్క్ చేరుకోవడానికి మాక్స్వెల్కు ఐదేండ్లు పట్టడం గమనార్హం. స్టార్ ఆల్రౌండర్గా పేరున్న మాక్స్వెల్ గత ఐదేండ్లలో ఒక్క మ్యాచ్లోనూ అర్ధశతకం సాధించలేకపోయాడు. మాక్సీ చివరిసారిగా 2016 సీజన్లో 50 మార్క్ చేరుకున్నాడు. ఐపీఎల్లో మాక్స్వెల్(2016-21) 40 ఇన్నింగ్స్ల తర్వాత 50+ స్కోరు అందుకున్నాడు.