లాక్ డౌన్ తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు రెడీగా లేనంటున్నాడు టాలీవుడ్ (Tollywood) అగ్రహీరో చిరంజీవి (Chiranjeevi). ఈ స్టార్ హీరో ప్రస్తుతం ఆచార్య (Acharya)తోపాటు మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. వరుస సినిమాలతో తీరక లేకుండా ఉండేలా షెడ్యూల్ సెట్ చేసుకున్నాడు. చిరంజీవికి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆచార్యలో ఓ పాట చిత్రీకరణలో బిజీగా ఉన్నాడట చిరు. ఈ సాంగ్ ను కోకాపేట (Kokapet)లో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.
ఈ మల్టీ స్టారర్ పాటలో చిరంజీవి, రాంచరణ్, పూజాహెగ్డే పై చిత్రీకరిస్తున్నాడట కొరటాల శివ (Koratala Siva ). మరోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో నటిస్తున్న గాడ్ ఫాదర్ (Godfather) తదుపరి షెడ్యూల్ సెప్టెంబర్ 21 నుంచి ఊటీలో ప్రారంభం కానుంది. తాజా అప్ డేట్ ప్రకారం సెప్టెంబర్ 28 వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఆచార్య పాట చిత్రీకరణ పూర్తయిన తర్వాత చిరు ఊటీకి పయనం కానున్నాడట. అంతా అనుకున్నట్టుగా జరిగితే తక్కువ వ్యవధిలోనే చిరంజీవి సినిమాలు థియేటర్లలో సందడి చేయడం ఖాయమైనట్టే.
ఆచార్య షూటింగ్ చివరి దశలో ఉంది. మేకర్స్ త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా..మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే విడుదలై లాహే లాహే పాటకు యూ ట్యూబ్లో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబట్టింది.
Nani | షాహిద్ కపూర్ గొప్ప నటుడు..రీమేక్ అద్భుతం
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Bheemla nayak: ఇక వరుస సర్ప్రైజ్లతో సందడి చేయనున్న రానా..!