టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతివ్వాలి
గ్రేటర్ ఎన్నికల్లో అండగా నిలువాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు,బోయినపల్లి వినోద్కుమార్
వరంగల్, ఏప్రిల్ 25 : సమాజ సేవలో ముందుండే ఆర్యవైశ్యులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం సుశీల్గార్డెన్లో మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు అధ్యక్షతన జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ 75 సంవత్సరాలుగా పాలకులు ఆర్యవైశ్య సమాజాన్ని పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ పాలనలో ఆర్యవైశ్యులకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించారని అన్నారు. నాలుగు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కేటాయించి రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చింది ముఖ్యమంత్రి కేసీఆరేనని గుర్తుచేశారు. వ్యాపార రంగంలో ఉంటూ ప్రతి రోజూ వేలాది మందితో పరిచయాలు ఉండే ఆర్యవైశ్యులకు ఓటర్లను ప్రభావితం శక్తి ఉందన్నారు. ఆర్యవైశ్యులు టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలువాలని కోరారు. గ్రేటర్ ఎన్నికల్లో ఆర్యవైశ్యులు కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. రాజకీయ ప్రాధాన్యత కల్పించిన పార్టీకి పట్టం కట్టాలన్నారు. అనంతరం ఆర్యవైశ్యులు వినోద్కుమార్కు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.