పుదుచ్చేరి : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్డీఏ కూటమి విజయం దిశగా ముందుకు సాగుతోంది. కూటమిలోని ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ మూడు చోట్ల ఆధిక్యంలో ఉంది. అలాగే డీఎంకే, కాంగ్రెస్ ఒక్కో స్థానంలో ముందంజలో ఉన్నాయి. 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో ఒకే దశలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరిగాయి. యూటీలోని ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాని ముందే కూలిపోయింది. ఐదుగురు కాంగ్రెస్, ఓ డీఎంకే ఎమ్మెల్యే రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 33 మంది సభ్యులు (ముగ్గురు నామినేటెడ్) గల అసెంబ్లీలో బల నిరూపణకు ముందే ఫ్రిబవరి 22న నారాయణ స్వామి రాజీనామా చేయడంలో ఎన్నికలు అణివార్యమయ్యాయి. 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగ్గా.. 324 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల్లో ప్రధానంగా ఎన్డీఏ, కాంగ్రెస్-డీఎంకే కూటమి మధ్య కనిపిస్తోంది. అలాగే కమల్ హసన్కు చెందిన మక్కల్ నీది మయ్యం పార్టీ సైతం తన అభ్యర్థులను బరిలో నిలిపింది. ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ అధికారం సాధిస్తుందని అంచనా వేశాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ తొమ్మిది, అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్ 16, ఏఐడీఎంకే ఐదు స్థానాల్లో పోటీ చేసింది.