రంగ్ దే | తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మీడియం రేంజ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, మార్కెట్ సంపాదించుకున్నాడు నితిన్. దాదాపు 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈయన.. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఈయన చేతిలో దాదాపు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది దారుణంగా నిరాశ పరిచింది. ఇక ఇఫ్పడు ఈయన రంగ్ దే సినిమాతో వస్తున్నాడు. మార్చి 26న సినిమా విడుదల కానుంది. కీర్తి సురేష్ ఇందులో నితిన్ కు జోడీగా నటించింది. వెంకీ అట్లూరీ దర్శకుడు. మిస్టర్ మజ్ను లాంటి ఫ్లాప్ తర్వాత ఈయన చేస్తున్న సినిమా కావడంతో రంగ్ దే విజయం వెంకీకి కూడా కీలకంగా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఏరియా వైజ్ ఎంత చేసింది.. ఎంత వసూలు చేయాలి అనేది చూద్దాం..
నైజాం: 7.60 కోట్లు
సీడెడ్: 3.60 కోట్లు
ఉత్తరాంధ్ర: 10.00 కోట్లు
హైర్స్తో కలుపుకుని సినిమా బిజినెస్ రూ.23 కోట్ల వరకు జరిగింది. ఇప్పుడు రంగ్ దే సినిమా విజయం సాధించాలంటే రూ.24 కోట్ల షేర్ వసూలు చేయాలి. బాక్సాఫీస్ దగ్గర రానా దగ్గుబాటి అరణ్య సినిమాతో పోటీ పడుతున్నాడు నితిన్. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే నితిన్ మార్కెట్కు ఈ వసూళ్లు సాధించడం పెద్ద విషయమేం కాదు. కానీ కావాల్సింది పాజిటివ్ టాక్. మరి అది వస్తుందో లేదో చూడాలిక.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఐశ్వర్యరాజేశ్ ఫైనల్..మరో హీరోయిన్ కోసం వేట..!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ..!
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
ముద్దు వీడియో షేర్ చేసిన జెనీలియా.. స్పందించిన ప్రీతి
ఈ ఇద్దరు కొత్త హీరోయిన్ల సుడి పీక్స్.. స్టార్ హీరోలతో ఆఫర్స్
తరుణ్ రీఎంట్రీ.. లవ్ స్టోరీతో వస్తున్నాడంట