న్యూఢిల్లీ: కొవిడ్-19 టీకా పొందినంత మాత్రాన కరోనా ఇన్ఫెక్షన్ సోకదని చెప్పలేమని ఆరోగ్య అభివృద్ధి వ్యవహారాల ఆర్థికవేత్త ప్రొఫెసర్ అనుప్ మలానీ తెలిపారు. అయితే టీకా తీసుకున్న వారిలో వ్యాధి తీవ్రతను తగ్గించడానికి, వేగంగా నయం కావడానికి వ్యాక్సిన్ దోహదపడుతుందని ఆయన వెల్లడించారు. భారత్లో ఇటీవల కొవిడ్ కేసులు భారీగా పెరుగడానికి రీ ఇన్ఫెక్షన్లే కారణమై ఉండవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.
అనూప్ మలానీ షికాగో విశ్వవిద్యాలయ లా స్కూల్, ప్రిట్జ్కర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో బోధనా విధులు నిర్వర్తిస్తున్నారు. ఐడీఎఫ్సీ అనే మేధోమథన సంస్థతో కలిసి భారత్లో కొవిడ్-19 సీరో అధ్యయనాలను నిర్వహిస్తున్నారు. ‘గతంలో ఒకసారి కొవిడ్ సోకడం, టీకాలు పొంది ఉండటంవల్ల ఆ మహమ్మారి నుంచి రక్షణ లభించదు. అయితే ఆ రెండు అంశాలవల్ల లభించిన రోగనిరోధక శక్తి చాలా ప్రయోజనకరం. అలాంటివారికి ఇన్ఫెక్షన్ సోకితే వేగంగా నయమవుతుంది’ అని ఆయన తెలిపారు.
దీనివల్ల మరణాలు, తీవ్ర అనారోగ్యాన్ని తగ్గించవచ్చని వివరించారు. సదరు వ్యక్తుల నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం కూడా తగ్గుతుందన్నారు. భారీగా గుమికూడటం, అక్కడి జనాభాలో రోగ నిరోధక స్థాయి వంటివి ప్రభావం కూడా చూపుతాయని తెలిపారు. ప్రజలు కొవిడ్పై విసుగెత్తిపోవడం లేదా టీకా వచ్చిందన్న భరోసాతో ఉండటంవల్ల మాస్కులు ధరించడంలేదన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బద్రీనాథ్ ఆలయంపై మల్లెలు చల్లినట్లుగా మంచు వర్షం.. వీడియో
కమలా హారిస్ను చంపేస్తామని బెదిరింపులు.. నర్సు అరెస్ట్
ప్రముఖ సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ కన్నుమూత.. ప్రధాని సంతాపం
మార్కెట్లో కొనితెచ్చిన పాలకూరలో పాముపిల్ల.. వీడియో
వీళ్లు కేరళ జాతిరత్నాలు.. వీళ్ల నటన అమోఘం.. వీడియో