న్యూఢిల్లీ : ఒలింపిక్స్ మెడల్ విజేత రెజ్లర్ సుశీల్ కుమార్ను ఓ మర్డర్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మర్డర్ విషయంలో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసేందుకు పోలీసు అతన్ని చత్రాసాల్ స్టేడియంకు తీసుకువెళ్లారు. 23 ఏళ్ల ఓ యువ రెజర్ల్ను హత్య చేసిన కేసులో సుశీల్ కుమార్ ప్రధాన నిందితుడు. కొందరు రెజ్లర్లతో మే 4వ తేదీన సుశీల్ కుమార్.. యువ రెజ్లర్లపై దాడి చేశాడు. ఆ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత పరారీ అయిన సుశీల్ను .. రెండు రోజుల క్రితం ఢిల్లీలోనే అరెస్టు చేశారు. మర్డర్ కేసులో ఇరుక్కున్న సుశీల్ను రైల్వే శాఖ ఉద్యోగం నుంచి తీసివేసింది. ప్రాపర్టీ వివాదం నేపథ్యంలో సహనం కోల్పోయిన సుశీల్.. యువ రెజ్లర్లపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్య జరిగిన ఛత్రాసాల్ స్టేడియం వద్దకు ఇవాళ ఉదయం పోలీసులు వెళ్లారు. సుశీల్ను అక్కడకు తీసుకువెళ్లిన పోలీసులు.. హత్య జరిగిన ప్రదేశంలో సీన్ను రిక్రియేట్ చేశారు. ఎందుకు, ఎలా దాడి జరిగిందన్న కోణంలో అక్కడే విచారించారు. సోమవారం రోజున ఈ కేసుకు సంబంధించిన సుశీల్ను నాలుగు గంటల పాటు క్రైం బ్రాంచీ పోలీసులు విచారించారు.