గాజులరామారం, మే 23 : కరోనా సోకితే భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని ఎమ్మె ల్యే కేపీ వివేకానంద్ సూచించా రు. ఆదివారం గాజులరామారం డివిజన్ పరిధిలోని చంద్రగిరినగర్, బతుకమ్మబండ, జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ, వీనస్ ఎంక్లేవ్ కాలనీ, వీనస్ రాక్స్ హైట్స్ కాలనీ, జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూంనగర్ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీవాసులు, స్థానిక కార్పొరేటర్లు రావుల శేషగిరిరావు, కొలుకుల జగన్తో కలిసి కరోనా పరిస్థితులు, సమస్యలపై తన క్యాంపు కార్యాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కరోనా లక్షణాలు ఉంటే అధైర్యపడకుండా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలన్నారు. అనంతరం మౌ లిక వసతుల కల్పనలో భాగంగా చంద్రగిరినగర్లో భూగర్భ డ్రైనేజీకి రూ.40 లక్షలు, బతుకమ్మ బండలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం రూ.20 లక్ష లు, జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో భూగర్భ డ్రైనేజీకి రూ.24 లక్షలు, జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మగ్దూంనగర్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.20 లక్షల నిధులు మంజూరైన సందర్భం గా ఎమ్మెల్యే కాలనీ వాసులకు శుభాకాంక్షలు తెలిపారు.