ఖమ్మం : అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రఘునాధపాలెం మండలం వివి పాలెం గ్రామంలో సుడా నిధులు రూ. 2కోట్లు, మంచుకొండ గ్రామంలో సుడా నిధులు 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
నాణ్యతా ప్రమాణాలు లోపించకుండా పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, సుడా చైర్మన్ విజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
చిన్నారి గుండెకు అండగా ఎమ్మెల్యే మర్రి
ప్రజా సేవలో పోలీసులు అంకితం కావాలి
మెడికల్ హబ్గా మహబూబాబాద్ : మంత్రి సత్యవతి
వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలి