రాంగోపాల్ వర్మ..ఎప్పుడు ఏ సినిమా అనౌన్స్ చేస్తాడో..ఏది విడుదల చేస్తాడో చెప్పడం కష్టం. సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్స్ తో అందరికి షాకిచ్చే వర్మ ఈ సారి కూడా అలాంటి ప్లాన్ చేస్తున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. రాంగోపాల్ వర్మ సినిమాలంటే హిట్టు, ప్లాపులతో సంబంధముండదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏరోటిక్ థ్రిల్లర్ జోనర్ లో 2014లో ఐస్క్రీమ్ సినిమా తీశాడు వర్మ. ఆ తర్వాత ఐస్క్రీమ్ 2 కూడా తెరకెక్కించాడు.
మొదటి పార్టులో నవదీప్, తేజస్వి లీడ్ రోల్స్ లో నటించగా.సెకండ్ పార్టులో మృదులా భాస్కర్ మెయిన్ లీడ్ రోల్లో నటించింది. అయితే ఆర్జీవీ ఐస్ క్రీమ్ ప్రాంఛైజీలో మూడో ఇన్ స్టాల్ మెంట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. రెండు ప్రాజెక్టులను నిర్మించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ మూడో పార్టును కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారని టాలీవుడ్ వర్గాల టాక్.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి నటీనటులు, ఇతర వివరాలపై వర్మ కాంపౌండ్ నుంచి త్వరలోనే స్పష్టత రానున్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
థ్రిల్లింగ్ వెబ్ సిరీస్లో రాశీఖన్నా..?
అలియాబట్ ఆర్ఆర్ఆర్ పాటలో జాయిన్ అయ్యేదెప్పుడంటే..?
పవన్-రానా మల్టీస్టారర్ లో భారీ మార్పు..?
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!